కోడిపెట్టను ఎరగా వేసి పుంజు ఎత్తుకెళ్లారు
NEWS Feb 22,2026 03:36 pm
TG: మగవాళ్ళను బురిడీ కొట్టించి డబ్బు కాజేయడం, సీక్రెట్ సమాచారం సేకరించే హనీ ట్రాప్ కేసులు చూస్తుంటాం. కానీ భద్రాద్రి జిల్లా జేత్యాతండాలో దుండగులు కోడిపెట్టను ఎరగా వేసి పుంజును ఎత్తుకెళ్లారు. రైతు లకావత్ జేత్రామ్ 3పుంజులు, ఒక పెట్టను పెంచుకుంటున్నాడు. 3రోజుల క్రితం ఇద్దరు వ్యక్తులు బైక్పై వచ్చి కోడిపెట్టను చూపించి, దగ్గరికి వచ్చిన పుంజును పట్టుకొని ఉడాయించారు. జేత్రామ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.