దివ్యాంగులకు పురస్కారాలు ప్రధానం
NEWS Feb 21,2026 06:18 pm
HYD: శాంతి దివ్యాంగుల సంఘం నిర్వహణలో, శ్రీగిరి రజిని ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో మహాశివరాత్రి మహోత్సవం ఘనంగా జరిగింది. ప్రతిభావంతులైన దివ్యాంగులకు పురస్కారాలు అందించారు. దివ్యాంగులకు మద్దతు ఇస్తే వారి ప్రతిభ మరింత వెలుగులోకి వస్తుందని ముఖ్య అతిథులుగా పాల్గొన్న GBN Elite అధ్యక్షుడు మట్టా రాజుగౌడ్, సెక్రటరీ శేఖర్ గౌడ్ అన్నారు. కళాప్రదర్శనలు చేసిన చిన్నారులకు మెమోంటోలు అందించారు. నటి రాగిణి తదితరులు హాజరయ్యారు.