దివ్యాంగులకు పురస్కారాలు ప్రధానం
NEWS Feb 21,2026 06:12 pm
HYD: శాంతి దివ్యాంగుల సంఘం నిర్వహణలో, శ్రీగిరి రజిని ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో మహా శివరాత్రి మహోత్సవం ఘనంగా జరిగింది.ప్రతిభా వంతులైన దివ్యాంగులకు ప్రత్యేక పురస్కారాలు అందజేశారు. దివ్యాంగులకు మద్దతు ఇస్తే వారి ప్రతిభ మరింత వెలుగులోకి వస్తుందని ముఖ్య అతిథి, GBN Elite ఉపాధ్యక్షుడు సందగళ్ల మధుసూధన్ గౌడ్ అన్నారు. కళాప్రదర్శనలు చేసిన చిన్నారులకు మెమోంటోలు అందించారు. నటి రాగిణి తదితరులు హాజరయ్యారు.