కార్పొరేటర్ మధుచంద్కు అభినందనలు
NEWS Feb 21,2026 10:03 pm
38వ డివిజన్ నుంచి కార్పొరేటర్గా ఘన విజయం సాధించిన బత్తుల మధుచంద్ను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సి మాల మహానాడు జిల్లా యూత్ అధ్యక్షులు వాసుమల్ల గౌతమ్ ప్రత్యేకంగా కలసి, విజయానికి హార్దిక అభినందనలు తెలియజేశారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ 38వ డివిజన్ సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.