నిమిషం ఆలస్యమైనా ఎంట్రీ లేదు
NEWS Feb 21,2026 05:17 pm
AP: ఈ నెల 23 నుంచి జరిగే ఇంటర్ పరీక్షలకు 1,537 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. ఉదయం 9 గంటలకు పరీక్షలు ప్రారంభం కానుండగా, ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉండదని చెప్పింది. ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, కాలిక్యులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను ఎగ్జామ్ హాలులోకి అనుమతించబోమన్నారు. ఫస్ట్, సెకండియర్ కలిపి 10,57,312 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.