‘AI’ తీర్మానంపై 86 దేశాల సంతకాలు
NEWS Feb 21,2026 04:41 pm
ఢిల్లీ: ‘ఇండియా- AI ఇంపాక్ట్ సదస్సు’ విజయవంతమైందని, ప్రపంచ దేశాల నుంచి బలమైన మద్దతు లభించిందని కేంద్ర IT మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. సదస్సు తీర్మానంపై 86 దేశాలతో పాటు 2 అంతర్జాతీయ సంస్థలు సంతకం చేసినట్లు తెలిపారు. అమెరికా, బ్రిటన్, కెనడా, చైనా, డెన్మార్క్, జర్మనీ తదితర దేశాలు సంతకం చేసినవాటిలో ఉన్నాయని చెప్పారు. ‘ప్రధాని మోదీ ‘ఏఐ’ దార్శనికతను ప్రపంచం ఆమోదించిందన్నారు.