వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి
NEWS Feb 19,2026 03:33 pm
నిర్మల్: శాంతినగర్ కాలనీలో రూరల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని మున్సిపల్ చైర్పర్సన్ అప్పల కావ్య, వైస్ చైర్మన్ అప్పల గణేష్ ప్రారంభించారు. రోగులు ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్వచ్చంద సంస్థలు ఏర్పాటు చేస్తున్న వైద్య శిబిరాలకు స్థానిక వైద్యులు సహకరించాలని సూచించారు. వార్డ్ కౌన్సిలర్ సుమలత ఆధ్వర్యంలో ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని, ఈ శిబిరం ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలని అన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉచిత వైద్య సేవలు అందిస్తున్న స్వచ్చంద సంస్థ సభ్యులను వారు అభినందించారు.