మల్లాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ను ప్రముఖ జర్నలిస్ట్, తెలంగాణ మీడియా అకాడమీ ఏఐ జర్నలిజం శిక్షణ తరగతుల బోధకుడు ముద్దం నరసింహ స్వామి ఘనంగా సత్కరించారు. మల్లాపూర్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సర్పంచ్కు శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా నరసింహ స్వామి మాట్లాడుతూ.. మల్లాపూర్ను జిల్లాలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేయాలని ఆకాంక్షించారు.