భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కు రికార్డు వ్యూస్
NEWS Feb 16,2026 06:19 pm
కొలంబో వేదికగా భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన హైవోల్టేజ్ మ్యాచ్ రికార్డులను బ్రేక్ చేసింది. జియో హాట్స్టార్లో ఏకంగా 45.4 కోట్ల వ్యూస్ వచ్చాయి. దీంతో ఈ వరల్డ్ కప్లోనే అత్యధిక మంది వీక్షించిన మ్యాచ్గా నిలిచింది. ఈ మ్యాచ్ను అభిమానులు మొబైల్ ఫోన్స్, టీవీల్లో లైవ్ వీక్షించారు. అలాగే IND vs USA మ్యాచ్కు 26 కోట్లు, IND vs NAM మ్యాచ్కు 24 కోట్ల వ్యూస్ వచ్చాయి.