నిజామాబాద్ మేయర్ పీఠం 'హస్తం'దే!
NEWS Feb 16,2026 02:52 pm
నిజామాబాద్ మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మేయర్గా ఉమారాణి డిప్యూటీ మేయర్గా సల్మా తహీన్ (MIM) ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 60 డివిజన్లలో బీజేపీకి 28, కాంగ్రెస్కు 17, MIMకు 14, BRSకు 1 వచ్చాయి. మేయర్ పీఠం దక్కాలంటే.. మ్యాజిక్ ఫిగర్ 31 రావాల్సి ఉంటుంది. అంటే.. మ్యాజిక్ ఫిగర్కు 3 అడుగుల దూరంలో బీజేపీ ఆగింది. కాంగ్రెస్ MIMను తన దారికి తెచ్చుకొంది. దాంతో 31 సీట్లు వచ్చినట్లు అయింది. అలాగే ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లు కూడా కలిసి.. మరో 2 ఓట్లు ఆ పార్టీకి వచ్చి చేరాయి. అలాగే BRS నుంచి గెలిచిన ఒక్క అభ్యర్థి సైతం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయాడు. ఈ పీఠం సులువుగా కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడింది.