కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీదే!
NEWS Feb 16,2026 08:49 am
కరీంనగర్ కార్పొరేషన్ను బీజేపీ తొలిసారి దక్కిం చుకుంది. మేయర్గా కొలగాని శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేశారు. 9 స్థానాల BRS తటస్థంగా వ్యవహరించడంతో బీజేపీ గెలుపు సులువైంది. బీజేపీకి 34 ఓట్లు రాగా, కాంగ్రెస్ ప్రతిపాదించిన మేయర్ అభ్యర్థి నర్మదకు 21 ఓట్లు వచ్చాయి. కరీంనగర్ కార్పొరేషన్లో 66 స్థానాలు ఉండగా, బీజేపీ 30, కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 9, మజ్లిస్ 3 స్థానాలు కైవసం చేసుకున్నాయి. ఇతరులు 10 చోట్ల గెలుపొందారు.