పాకిస్తాన్ పై భారత్ శివ తాండవం
టీ20 ప్రపంచ కప్లో భారత్ విజయం
NEWS Feb 15,2026 10:48 pm
మహా శివరాత్రి వేళ టీ20 ప్రపంచ కప్లో పాకిస్తాన్ కు కాలరాత్రి - భారత్ కు శివరాత్రి. భారత్ బౌలర్ల శివతాండవంతో పాక్ ఓటమి పాలైంది. 175 పరుగులు చేసిన భారత్ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాక్ 114 పరుగులకే కుప్పకూలింది. ఇషాన్ కిషన్ 40 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో సహా 77 పరుగులు చేశాడు. టీ20 ప్రపంచ కప్లో భారత్ పాకిస్థాన్ను 61 పరుగుల తేడాతో ఓడించింది. టోర్నమెంట్ చరిత్రలో పరుగుల పరంగా పాకిస్థాన్పై భారత్ సాధించిన అతి పెద్ద విజయం ఇది. ఈ విజయంతో, భారత జట్టు సూపర్ 8 రౌండ్కు అర్హత సాధించింది.