2029 ఏప్రిల్లో జమిలి ఎన్నికలు
NEWS Feb 12,2026 09:23 pm
దిల్లీ పర్యటనలో సీఎం రేవంత్రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. దేశవ్యాప్తంగా 2029 ఏప్రిల్లో జమిలి ఎన్నికలు జరుగుతాయని, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా అప్పుడే ఉంటాయని అన్నారు. హైదరాబాద్ను బుల్లెట్ రైలు ప్రాజెక్టు హబ్గా మారుస్తామని, విమానాశ్రయం సమీపంలో భూమి కేటాయిస్తామని తెలిపారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని ప్రతిపాదిస్తామన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను తోసిపుచ్చుతూ, కిషన్రెడ్డి కోరితే దీనిపై సీబీఐ విచారణకు కూడా సిద్ధమని రేవంత్రెడ్డి సవాల్ విసిరారు. సింగరేణి అప్పులకు గత ప్రభుత్వమే కారణమని స్పష్టం చేశారు.