జర్నలిస్టుల చట్టాలు పునరుద్ధరించాలి: వెంకటేష్
NEWS Feb 12,2026 09:18 pm
అనకాపల్లి జిల్లాలో జరిగిన ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ల ఆందోళనలో జర్నలిస్టులు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు భీమరశెట్టి వెంకటేష్ మాట్లాడుతూ, కేంద్రం రద్దు చేసిన వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్–1955, పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్–1958లను తిరిగి అమలు చేయాలని డిమాండ్ చేశారు. చట్టాల రద్దుతో జర్నలిస్టుల హక్కులు, భద్రతకు ప్రమాదం ఏర్పడిందన్నారు. కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.