లోక్సభలో రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే డిమాండ్ చేశారు. దేశ ప్రతిష్టకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు. విదేశాల్లో భారత్పై తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఈ విషయంపై స్పీకర్కు నోటీసు ఇచ్చినట్లు తెలిపారు. రాహుల్పై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని బీజేపీ అభిప్రాయపడింది. ఈ అంశం రాజకీయంగా చర్చనీయాంశమైంది.