కొంతలం గ్రామంలో మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 15 ఎకరాల సరుగుడు తోటలు దగ్ధమయ్యాయి. తుమ్మలపూడి రాజారావు, సీతిన శ్రీను, గొర్లె మణికంఠలకు చెందిన తోటలతో పాటు ఇతర రైతులకు నష్టం జరిగింది. ఈ ఘటనతో భారీ నష్టం వాటిల్లిందని స్థానిక రైతులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చినా, వారు చేరుకునేలోపే గ్రామస్థులే మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.