దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి
NEWS Feb 11,2026 10:23 pm
అనంతగిరి మండల కేంద్రంలో 12న నిర్వహించే దేశావ్యాప్త సమ్మెలో కార్మికులు కర్షకులు ఉద్యోగులు సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని జడ్పిటిసి దిసరి గంగరాజు పిలుపునిచ్చారు. వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన 4 లేబర్ కొడ్లను రద్దు చేసి 12 గంటల పని సమయాన్నీ రద్దు చేసి 8 గంటల పని సమయాన్ని అమలు చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. జరుగబోయే సమ్మెకు అన్ని వర్గాల వారు పాల్గొన్ని జయప్రదం చేయాలని కోరారు.