ఓటుహక్కులో 88 ఏళ్ల వృద్ధురాలు ఆదర్శం
NEWS Feb 11,2026 07:39 pm
మెట్పల్లి మున్సిపాలిటీ 11వ వార్డు వెంకట్రావుపేటకు చెందిన 88 ఏళ్ల ఆడెపు సరస్వతి బెడ్రెస్ట్ పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఓటు హక్కును వినియోగించి ఆదర్శంగా నిలిచారు. తన మనవడు, మనవరాలితో కలిసి అంబులెన్స్లో మెట్పల్లిలోని పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఆమె ఓటు వేశారు. వయసు, అనారోగ్యం ఏమాత్రం అడ్డుకాలేదని, ప్రజాస్వామ్యంపై ఉన్న బాధ్యతను ఆమె చూపిన తీరును స్థానికులు అభినందించారు. ఈ ఘటన ఓటు విలువను గుర్తు చేస్తూ పలువురికి ప్రేరణగా మారింది.