షేరిగూడలో పోలింగ్ ఉద్రిక్తత
NEWS Feb 11,2026 05:11 pm
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సమయంలో రంగారెడ్డి జిల్లా శేరిగూడలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రం ముందున్న ఒక ఇంట్లో పెద్ద సంఖ్యలో యువకులు గుమిగూడగా, పోలీసులు పరిస్థితిని నియంత్రించడానికి ప్రయత్నించారు. పోలీస్ వాహనానికి కుటుంబ సభ్యులు అడ్డుపడడంతో వాగ్వాదం మొదలైంది. తీవ్ర పరిస్థితులను నివారించడానికి అధికారులు శాంతి ఏర్పాట్లపై దృష్టి పెట్టారు.