నిర్మల్ పట్టణంలో జరుగుతున్న మునిసిపల్ ఎన్నికలలో స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థికి చెందిన ఏజెంట్లు తమ దుర్వినియోగం చేస్తున్నట్లు ఎంఐఎం, టిఆర్ఎస్ అభ్యర్థుల ఏజెంట్లు పోలింగ్ కేంద్రం వద్ద గొడవకు దిగారు. ఇరు వర్గాల వారి మధ్య ఈ గొడవ కారణంగా పోలింగ్ కేంద్రం వద్ద కాసేపు ఉదిరిక్త వాతావరణం నెలకొంది. ఒక ఏజెంట్ కు చెందిన పాసు మరొకరు వినియోగించకూడదని అధికారులకు ఫిర్యాదు చేశారు.