శివాలయాల్లో ఏర్పాట్లపై CM సమీక్ష
NEWS Feb 11,2026 10:47 am
AP: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని శివాలయాల్లో భక్తుల రద్దీపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. శ్రీశైలం సహా ప్రముఖ దేవాలయాల్లో భద్రతా చర్యలు కట్టుదిట్టంగా ఉండాలని అధికారులకు ఆదేశించారు. దర్శన ఏర్పాట్లు, తాగునీరు, వసతి, పారిశుధ్యం వంటి సౌకర్యాలు సమృద్ధిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమగ్ర ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు.