భారత్ జోరు.. పాక్ బేజారు..
NEWS Feb 11,2026 12:24 pm
T20 వరల్డ్ కప్లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్పై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ICC జోక్యంతో ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్తో ఆడతామని పాక్ తెలిపింది. ఇప్పటివరకు జరిగిన T20 ప్రపంచకప్ల్లో భారత్దే స్పష్టమైన ఆధిపత్యం. 8 మ్యాచ్ల్లో 7 సార్లు గెలిచిన టీమిండియా, 2021లో ఒక్కసారి మాత్రమే పాక్పై ఓడింది. గత ప్రపంచ కప్లోనూ తక్కువ స్కోరే అయినా భారత్ విజయం సాధించింది. కొలంబోలో మరోసారి పైచేయి సాధించాలనే పట్టుదలతో భారత్ బరిలోకి దిగుతోంది.