ఓటు వేసిన సీఎం రేవంత్ రెడ్డి
NEWS Feb 11,2026 12:17 pm
కొడంగల్: మున్సిపల్ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొడంగల్ జడ్పీ హైస్కూల్లో ఓటు వేశారు. కాసేపట్లో సీఎం శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకుని దిల్లీ వెళ్లనున్నారు. మధిర మున్సిపాలిటీ పరిధిలోని 9వార్డు పోలింగ్ కేంద్రంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంచిర్యాలలోని హైటెక్సిటీలో 227వ నంబర్ పోలింగ్ బూత్లో మంత్రి వివేక్ ఓటు వేశారు.