జనగణమన కంటే ముందు వందేమాతరం
NEWS Feb 11,2026 12:13 pm
అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, పాఠశాలల్లో ఇక నుంచి జాతీయ గీతం జనగణమన కంటే ముందుగా జాతీయ గేయం వందేమాతరం ఆలపించాలని కేంద్రం పేర్కొంది. వందేమాతరం ఆలపిస్తున్న సమయంలో అందరూ లేచి నిలబడాలని, అన్ని పౌరపురస్కారాలు ఇచ్చే సమయంలో వందేమాతరం ఆలపించాలని తెలిపింది. సినిమా హాళ్లలో దీనిని ప్రదర్శించాల్సిన అవసరం లేదన్నారు. ఆలపిస్తున్న సమయంలో అంతరాయం కలిగించేవారిపై గరిష్ఠంగా మూడేళ్ల జైలుశిక్ష విధించనున్నారు.