T20 WC: USAపై పాకిస్థాన్ విజయం
NEWS Feb 10,2026 10:43 pm
కొలంబో: టీ20 వరల్డ్ కప్లో యూఎస్ఏపై పాకిస్థాన్ 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 190 పరుగులు చేసింది. సాహిబ్జాదా ఫర్హాన్ (73) టాప్ స్కోరర్. షాడ్లీ 4 వికెట్లు తీశాడు. లక్ష్యఛేదనలో యూఎస్ఏ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 158 పరుగులే చేసింది. శుభమ్ రంజన్ (51) అర్ధ సెంచరీ చేశాడు.