ఆలయ ప్రాంగణంలో విస్తృత వృక్షారోపణ
NEWS Feb 10,2026 07:23 pm
మానవ మనుగడకు మొక్కలే జీవనాధారమని జడ్పీటీసీ సభ్యుడు దొండా రాంబాబు అన్నారు. వడ్డాది గిరిజాంబగిరిలో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో వృక్షారోపణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాల్లోని రోడ్ల డివైడర్లలో 4,500 మొక్కలను నాటించారు. నాటిన మొక్కలను సంరక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గిరిజాంబగిరి ప్రాంగణాన్ని హరితమయం చేసి భక్తులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.