యువజన సంఘం నూతన అధ్యక్షునిగా లచ్చన్న
NEWS Feb 10,2026 04:19 pm
కథలాపూర్: యువజన సంఘం ఆధ్వర్యంలో వెల్చాల లచ్చన్నను అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు సంఘ సభ్యులు తెలిపారు. అధ్యక్షులు లచ్చన్న మాట్లాడుతూ.. మండల కేంద్రంలో తనపై నమ్మకం ఉంచి ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్తానని చెప్పారు. ప్రధాన కార్యదర్శిగా మామిడిపల్లి రాకేష్ని ఎన్నుకున్నారు. నవనంది శ్రీను, బావు కిషన్, కంటే సత్యనారాయణ, వేణు, లక్ష్మిరాజాం, రాజేష్, రాజేందర్ రావు, గంగాధర్, శంకర్, పెద్దమల్ల తదితరులు పాల్గొన్నారు.