‘దృశ్యం 3’ క్లైమాక్స్ షాక్కు గురిచేస్తుంది
NEWS Feb 09,2026 10:55 pm
‘దృశ్యం’, ‘దృశ్యం-2’ సినిమాలు ఉత్కంఠభరితమైన క్లైమాక్స్లతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. వీటిని మించిన థ్రిల్ను దృశ్యం 3 అందిస్తుందని నటి ఆశా శరత్ చెప్పారు. మూడో భాగం క్లైమాక్స్ చూసి ప్రేక్షకులు స్టన్ అవుతారని అన్నారు. మోహన్లాల్ హీరోగా, జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన మలయాళ ‘దృశ్యం 3’ ఏప్రిల్ 2న విడుదల కానుంది. వెంకటేశ్ హీరోగా తెలుగు వెర్షన్ అక్టోబరులో విడుదలయ్యే అవకాశముందట.