రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన సీఐ అనిల్
NEWS Feb 09,2026 10:27 pm
మెట్పల్లి: శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని మెట్పల్లి సీఐ అనిల్ కుమార్ హెచ్చరించారు. ఎన్నికల నేపథ్యంలో పట్టణంలోని రౌడీషీటర్లకు పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి కార్యక్రమాల్లోనూ వారు పాల్గొనరాదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం కఠినంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.