స్పీకర్పై అవిశ్వాసానికి విపక్షాల సన్నాహాలు
NEWS Feb 09,2026 03:58 pm
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు విపక్ష ఇండియా కూటమి సిద్ధమైంది. సభలో తమ గొంతు నొక్కేస్తున్నారని, స్పీకర్ నిష్పాక్షికంగా వ్యవహరించడం లేదని కాంగ్రెస్ సహా ప్రతిపక్ష ఎంపీలు ఆరోపిస్తున్నారు. నరవణె పుస్తక ప్రస్తావన సమయంలో రాహుల్ గాంధీని అడ్డుకోవడం, ప్రధానిపై దాడి ప్రయత్నం అంటూ మహిళా ఎంపీలపై నిరాధార ఆరోపణలు చేయడం వివాదానికి దారి తీసిందని విపక్షాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో రేపు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం..