ప్రచారంలో పాల్గొన్న కొత్తగూడెం MLA
NEWS Feb 09,2026 10:34 am
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ–కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 48వ డివిజన్ నుంచి సీపీఐ అభ్యర్థి గుగులోత్ బాలు నాయక్ విజయం కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొత్తగూడెం MLA కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. యర్రగుంటలోని ఎస్పీ కాలనీలో పర్యటించి, అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, డ్రైనేజీ తదితర సమస్యలను కచ్చితంగా పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ద్రాక్ష సురేష్, కురివిందుల సుధీర్ కుమార్, ద్రాక్ష శివ, శెట్టి ఏసు, గుడివాడ నారాయణ, సల్వాది రత్నం, శెట్టి కమలాకర్, నక్క నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.