విద్యార్థి సంఘం నేతల కిడ్నాప్ కేసులో మంచు విష్ణుకు తిరుచానూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు. 3 రోజుల్లో విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ముందుగా ఫిక్స్ చేసుకున్న షెడ్యూల్ కారణంగా ఈ నెల 15 తర్వాత విచారణకు వస్తానని తెలిపారు మంచు విష్ణు. ఈ కిడ్నాప్ కేసులో మోహన్బాబుకు మాత్రం నోటీసులు ఇంకా అందలేదు.