ఇద్దరు పిల్లలకు ఉరి వేసి తల్లి ఆత్మహత్య
NEWS Feb 08,2026 11:33 am
తిరుపతి జిల్లా పుత్తూరులో భర్త చేసిన అప్పులు, కుటుంబ బాధ్యతలు మోయలేక ఓ వివాహిత తన ఇద్దరు పిల్లలకు ఉరి వేసి, తానూ ఆత్మహత్య చేసుకుంది. నేషనూరుకు చెందిన పద్మ(28) తన కుమారులు తేజ(6), లాస్య(5)తో కలిసి ఈ దారుణానికి పాల్పడింది. భర్త శివశంకర్ జులాయిగా తిరుగుతూ ఇంటి ఖర్చులకు డబ్బులు ఇవ్వకపోవడం, అప్పులు చేయడమే కారణమని లేఖ రాసింది. పోలీసులు శివశంకర్ను అదుపులోకి తీసుకున్నారు.