నిజామాబాద్లోని ఫ్రూడెన్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 9వ నెల గర్భిణీ మహిళ మణీషాకు ప్లేట్లెట్స్ కౌంట్ 25,000కి తగ్గడంతో అత్యవసరంగా ఓ నెగటివ్ ప్లేట్లెట్స్ అవసరమైంది. నిజామాబాద్ బ్లడ్ సెంటర్ సూపర్వైజర్ భరద్వాజ్ ద్వారా రక్తదాతల అనుసంధాన కర్త ఉదయ్ కుమార్ను సంప్రదించగా, మెట్పల్లి పట్టణానికి చెందిన యాక్టివ్ బ్లడ్ డోనర్ రక్షన్ స్పందించాడు. అర్ధరాత్రి మెట్పల్లి నుంచి నిజామాబాద్ చేరుకుని ప్లేట్లెట్స్ దానం చేసి మానవత్వాన్ని చాటారు.