నిర్మల్ జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంక్షేమ ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు ఆసుపత్రిలో అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. బాలింతలకు చిన్నారులకు వైద్యం అందుతున్న తీరును ఆసుపత్రి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న రోగులను కలిసి వారితో డాక్టర్లు సరైన వైద్యం అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి ఆసుపత్రికి వచ్చే రోగులకు బాలింతలకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు