ప్రపంచకప్ - వైభవ్ వీరవిహారం!
NEWS Feb 06,2026 10:29 pm
అండర్-19 వన్డే ప్రపంచ కప్ టైటిల్ను భారత్ చేజిక్కించుకుంది. భారత్ నిర్దేశించిన 412 పరుగుల భారీ లక్ష్యం ముందు ఇంగ్లాండ్ చేతులెత్తేసింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ సిక్సర్లు, ఫోర్లతో వీరవిహారం చేశాడు. 55 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో శతకం పూర్తి చేసుకున్న అతడు.. ఆ తర్వాత మరింత చెలరేగి ఆడాడు. మరో 75 పరుగులను కేవలం 25 బంతుల్లోనే సాధించాడు. ఆ తర్వాత మానీ బౌలింగ్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. 218 స్ట్రైక్ రేట్తో.. 15 సిక్స్లు, 15 ఫోర్లను బాదాడంటే.. బౌలర్లను ఏ విధంగా ఊచకోత కోశాడో అర్థం చేసుకోవచ్చు.