కోరుట్లలో పోలీస్ ల ఫ్లాగ్ మార్చ్
NEWS Feb 06,2026 03:16 pm
ఎస్పీ ఆదేశాల మేరకు కోరుట్ల పట్టణంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నామని మెట్ పల్లి డీఎస్పీ రాములు తెలిపారు. ఎన్నికల టైంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రజలు శాంతియుతంగా ఓటు హక్కు వినియోగించుకునేలా భరోసా కల్పించడమే దీని లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల నియమాలను పాటించాలని, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కోరుట్ల సీఐ సురేష్ బాబు హెచ్చరించారు. మెట్ పల్లి, కోరుట్ల, సీఐ, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మెట్ పల్లి, కోరుట్ల, ఎస్ఐ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.