స్వతంత్ర అభ్యర్థి రామగిరి సుమంత్ ప్రచారం
NEWS Feb 06,2026 09:55 pm
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ–కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 40వ డివిజన్ స్వతంత్ర అభ్యర్థి రామగిరి సుమంత్ డివిజన్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొబ్బరి బోండాల దుకాణం వద్ద కొబ్బరికాయలు కొట్టి మాట్లాడారు. ప్రజలంతా బ్యాటు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. యువతకు ఒక అవకాశం ఇవ్వాలని, అభివృద్ధి కోసం నిజాయితీగా పనిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు. డివిజన్ ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరించడమే తన లక్ష్యమని సుమంత్ తెలిపారు.