ఒత్తిడిని అధిగమిస్తేనే సత్ఫలితాలు వస్తాయని ప్రధాని మోదీ విద్యార్థులకు సూచించారు. ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమంలో విద్యార్థులతో మాట్లాడారు. నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ఉండాలన్నారు. ఏకాగ్రతతో చదివితే నేర్చుకున్నది ఎప్పటికీ గుర్తుంటుందని చెప్పారు. పౌష్టికాహారం తింటూ తగినంత నిద్రపోవాలని సూచించారు. విద్యార్థులకు టెక్నాలజీ ఎన్నో సమకూరుస్తోందని, ఏఐ సాయంతో సమస్యలను వేగంగా పరిష్కరించుకోవచ్చని వెల్లడించారు.