నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఉన్న దినేష్ వైన్స్లో గత రాత్రి చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు షాపులోకి చొరబడి కౌంటర్లో ఉన్న రూ.50 వేల నగదుతో పాటు మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డు అయినట్లు సమాచారం. సమాచారం అందుకున్న ఖానాపూర్ పట్టణ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దుండగుల ఆచూకీ కోసం సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.