సైబర్ నేరాల నియంత్రణలో హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సైబర్ సెక్యూరిటీ బ్యూరో షీల్డ్ 2.O సదస్సు నిర్వహించారు. డీజీపీ శివధర్రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు హాజరయ్యారు. బాధితులకు రక్షణ, డిజిటల్ భవిష్యత్తుకు భద్రత అనే నినాదంతో సాగిన కార్యక్రమంలో ఏఐ ఆధారిత పోలీసు వ్యవస్థపై అధికారులతో చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐ రోబోలను ప్రదర్శించారు. రోబో చేసిన విన్యాసాలు, డ్యాన్స్ ఆకట్టుకున్నాయి.