హైదరాబాద్లో హైడ్రా ఫోన్ ఇన్ కార్యక్రమం
NEWS Feb 04,2026 09:58 pm
HYD: ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని కొనసాగిస్తోన్న హైడ్రా.. ప్రతి శనివారం 12pm to 1pm ఫోన్-ఇన్ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. నగర ప్రజలు 040-29565750, 040-29565759 నెంబర్లకు ఫోన్ చేసి చెరువులు, పార్కులు, రహదారులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలు.. వంటి అంశాలపై ఫిర్యాదు చేయవచ్చని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. గత ఫిర్యాదులు పరిష్కారం కాకపోతే.. ఫోన్ ఇన్ కార్యక్రమంలో తెలుసుకోవచ్చన్నారు.