కేరళ తరహాలో హైదరాబాద్లో హౌస్ బోట్లు!
NEWS Feb 04,2026 02:16 pm
తెలుగు ప్రజలకు తెలంగాణ టూరిజం తీపి కబురు అందించింది. కేరళ తరహాలో హైదరాబాద్లోనూ హౌస్ బోట్లు అందుబాటులోకి తీసుకురానుంది. హుస్సేన్ సాగర్లో 2, దుర్గం చెరువులో 6 బోట్లను ప్రవేశ పెట్టనున్నారు. ఒక్కో బోటులో 2 డబుల్ బెడ్రూంలు, క్యాంటీన్ వసతులు ఉంటాయని పేర్కొన్నారు. నీటిపై తేలియాడే ఈ ఇళ్లలో కుటుంబంతో గడిపేందుకు వీలుంటుంది. వీకెండ్ విహారయాత్రలకు ఇవి సరికొత్త అనుభూతిని ఇస్తాయని అధికారులు భావిస్తున్నారు.