దూసుకుపోతున్న బంగారం, వెండి ధరలు
NEWS Feb 04,2026 02:08 pm
బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. కిలో వెండి ధర ఒక్కరోజే రూ.14వేలు పెరగ్గా.. బంగారం ధర రూ.1.60 లక్షలు దాటి పయనిస్తోంది. 24 క్యారెట్ల మేలిమి 10 గ్రాముల పసిడి ధర రూ.1,64,400 పలికింది. నిన్న ఈ ధర రూ.1,58,500గా ఉండగా.. ఒక్కరోజే దాదాపు రూ.6వేలు పెరగింది. ఇక, క్రితం ముగింపు సమయానికి రూ.2,79,600 వద్ద ఉన్న కిలో వెండి ధర నేడు రూ.2,93,900కు చేరుకుంది.