సమ్మక్క-సారలమ్మ జాతర హుండీ లెక్కింపు
NEWS Feb 04,2026 01:49 pm
పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం గుండారంలో సమ్మక్క సారలమ్మ జాతర హుండీలను జాతర కమిటీ నిర్వాహకులు లెక్కించారు. రూ.2,13,286 ఆదాయం సమకూరిందని కమిటీ చైర్మన్ పిడుగు శంకర్ తెలిపారు. సర్ఫంచ్ జంగిలి పోచాలు, ఉప సర్పంచ్ అంబీరు రాజేందర్, వార్డు సభ్యులు, పిడుగు నర్సయ్య, పిడుగు స్వామి, జంగిలి కనకయ్య, దండె కనకరత్నం, గాదే మల్లేష్, గోస్కుల కుమార్, తంగెనపల్లి నరేష్, తదితరులు పాల్గొన్నారు.