ట్రాక్టర్ ప్రమాదంలో నలుగురు మృతి
NEWS Feb 03,2026 07:45 pm
జగిత్యాల: ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడిన ప్రమాదంలో నలుగురు వ్యవసాయ కూలీలు మృతి చెందారు. వ్యవసాయ కూలీలు పసుపు కోతకు వెళ్లి తిరిగి వస్తుండగా.. మల్లాపూర్ (మం) మొగిలిపేట వద్దకు రాగానే ట్రాక్టర్ అదుపుతప్పి నీటి గుంతలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.