TG: త్వరలో భూముల ధరల పెంపు
NEWS Feb 03,2026 03:37 pm
తెలంగాణలో భూముల ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. భూముల విలువల సవరణపై అధ్యయనం చేయాలని స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్ శాఖ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఫిబ్రవరి 1 నుంచి భూముల ధరలు పెంచగా, అదే తరహాలో తెలంగాణలోనూ నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. గత ఏడాది హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో భూముల విలువల పెంపుపై ప్రతిపాదనలు సిద్ధమైనప్పటికీ వాటిని ప్రభుత్వం పెండింగ్లో ఉంచింది. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా భూముల విలువలను సవరించాలన్న డిమాండ్లు పెరగడంతో, రేవంత్ ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. భూముల ధరలు పెరిగితే రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ ఛార్జీలు పెరిగి రియల్ ఎస్టేట్ మార్కెట్పై ప్రభావం చూపే సూచనలు ఉన్నాయి.