అమెరికా డీల్తో ధరలు తగ్గేవి ఇవే..
NEWS Feb 03,2026 01:05 pm
ప్రధాని మోదీ - అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ సంభాషణలో 2 దేశాల మధ్య కీలక వాణిజ్య ఒప్పందం కుదిరింది. భారతీయ ఉత్పత్తులపై అమెరికా సుంకాలను 18 శాతానికి తగ్గించడంతో, భారత్లో ల్యాప్టాప్లు, గ్యాడ్జెట్లు, ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉంది. పప్పు ధాన్యాలు, పాల ఉత్పత్తుల దిగుమతులు చౌకయ్యే సూచనలు ఉన్నాయి. మరోవైపు వస్త్రాలు, రెడీమేడ్ దుస్తులు, ఆభరణాల ఎగుమతులకు లాభం చేకూరుతుంది. అయితే స్టీల్, అల్యూమినియం వంటి కొన్ని ఉత్పత్తులపై అధిక సుంకాలు కొనసాగనున్నాయి. పూర్తి నిబంధనలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.