ఓటీటీలోకి 'మన శంకర వరప్రసాద్ గారు'
NEWS Feb 03,2026 11:09 am
చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ బ్లాక్ బస్టర్ గా నిలిచి, కలెక్షన్లు రూ.400 కోట్ల మార్క్ ను చేరింది. ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ 5 సొంతం చేసుకుంది. ఈ నెల 11 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.