రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
NEWS Feb 02,2026 05:21 pm
మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందడంతో విషాదం నెలకొంది. స్థానికుల కథనం ప్రకారం, చిట్టాపూర్కు చెందిన బొమ్మేనా యశ్వంత్ (20) బైక్పై వెళ్తున్న క్రమంలో సాతారం-ధర్మారం గ్రామాల మధ్య జరిగిన ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.